Surprise Me!

నేపాల్‌లో 81మంది తెలుగువారు. వీడియో కాల్‌లో మాట్లాడిన లోకేష్ | Nepal Gen Z Protests | Asianet Telugu

2025-09-10 0 Dailymotion

నేపాల్ రాజధాని ఖాట్మాండులో హింసాత్మక నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారితో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వీడియో కాల్‌లో మాట్లాడారు. పశుపతినాథ్ ఆలయ సమీపంలోని రాయల్ కుసుమ్ హోటల్‌లో విశాఖకు చెందిన 81మంది తెలుగువారు ఆశ్రయం పొందారు. విశాఖకు చెందిన రోజారాణితో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్న లోకేష్.. “అధైర్యపడొద్దు.. మిమ్మల్ని సురక్షితంగా తీసుకువస్తాం” అని భరోసా ఇచ్చారు. భారత విదేశాంగశాఖతో నిరంతరంగా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి 2 గంటలకు ఒకసారి మీతో టచ్‌లో ఉంటాం అని భరోసా ఇచ్చారు. ఖాట్మాండు నుంచి విశాఖకు ప్రత్యేక విమానం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.<br /><br />#NaraLokesh #NepalProtests #Kathmandu #Visakhapatnam #GenZProtests<br /><br />Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. <br />Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Buy Now on CodeCanyon